ఏపీలో తిరుపతిని మహానగరంగా అభివృద్ధి...

- January 07, 2016 , by Maagulf
ఏపీలో తిరుపతిని మహానగరంగా అభివృద్ధి...

సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం తిరుపతిలో జరిగిన ఖజన్మభూమిమావూరుగ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఏపీలో తిరుపతిని మహానగరంగా అభివృద్ధి చేసుకోవాలని దీనిపై ప్రస్తుతం తాము ఆలోచిస్తున్నామన్నారు. తిరుమలకు వేలాదిగా వచ్చే భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలు అందించాలని అధికారులను ఆదేశించారు. జన్మభూమి ద్వారా గ్రామసభలు పెట్టి ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తున్నామని వెల్లడించారు. ఇంకా ఆయనేమన్నారంటే... ఖసంక్షేమ కార్యక్రమాలు లబ్ధిదారులకు నేరుగా అందేలా చేస్తున్నాం. పేదరిక నిర్మూలనతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. జన్మభూమిలో రేషన్‌ కార్డులను పంపిణీ చేస్తున్నాం. ప్రతి పండగకు ప్రత్యేక కానుకలు అంద చేస్తున్నాంగ అని సీఎం పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com