ఏపీలో తిరుపతిని మహానగరంగా అభివృద్ధి...
- January 07, 2016
సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం తిరుపతిలో జరిగిన ఖజన్మభూమిమావూరుగ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఏపీలో తిరుపతిని మహానగరంగా అభివృద్ధి చేసుకోవాలని దీనిపై ప్రస్తుతం తాము ఆలోచిస్తున్నామన్నారు. తిరుమలకు వేలాదిగా వచ్చే భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలు అందించాలని అధికారులను ఆదేశించారు. జన్మభూమి ద్వారా గ్రామసభలు పెట్టి ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తున్నామని వెల్లడించారు. ఇంకా ఆయనేమన్నారంటే... ఖసంక్షేమ కార్యక్రమాలు లబ్ధిదారులకు నేరుగా అందేలా చేస్తున్నాం. పేదరిక నిర్మూలనతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. జన్మభూమిలో రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నాం. ప్రతి పండగకు ప్రత్యేక కానుకలు అంద చేస్తున్నాంగ అని సీఎం పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







