2016 పారా ఒలింపిక్స్ కు నల్గురు క్రీడకారులను పంపనున్న బహ్రెయిన్

- January 07, 2016 , by Maagulf
2016 పారా ఒలింపిక్స్ కు  నల్గురు క్రీడకారులను పంపనున్న బహ్రెయిన్

 పారా ఒలింపిక్స్ క్రీడలకు బహ్రెయిన్ రాజ్య మద్దతు ఎప్పుడు ఉంటుందని, వికలాంగుల ఆతల అభివృద్దికి అన్ని విధాల అందిచడంలో బహ్రెయిన్ ఎంతో కీలాక్ పాత్ర పోషిస్తుందని పారా  ఒలింపిక్స్ బహ్రెయిన్ అసోసియేషన్ చైర్మెన్ షేక్ మొహమ్మద్ బిన్ దొరసి అల్ ఖలీఫా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రీడలకు  బహ్రెయిన్ సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాక అదించాల్సిన సేవలను నిరంతరం అంధ చేస్తున్నట్లు ఆయన తెలిపారు, అలాగే , వికలాంగుల క్రీడల పట్ల బహ్రెయిన్ గౌరవ రాజు షేక్  నస్సేర్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఉన్నతమైన న్యాయ పాలనలో పారా ఒలింపిక్స్ క్రీడలకు పూర్తి ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా, పారా ఒలింపిక్స్ బహ్రెయిన్  అసోసియేషన్ చైర్మెన్ షేక్ మొహమ్మద్ బిన్ దొరసి అల్ ఖలీఫా స్థానిక బహ్రెయిన్ న్యూస్ ఏజెన్సీ తో  మాట్లాడుతూ 2016 లో జరగనున్న పారా ఒలింపిక్స్ కు  ఆతిద్యమివ్వబోతున్న బ్రెజిల్ గతంలో ప్రపంచ కప్పు పోటీలను నిర్వహించిన  ఘనత ఉందని చెబ్తూ,  తమకు పారా ఒలింపిక్స్ ఎంతో ప్రతిష్టాకరమైనదని, తమ బహ్రెయిన్ దేశం నుంచి నలుగురు క్రీడాకారులను ఈ పోటీలకు పంపుతున్నట్లు ఆయన  పేర్కొన్నారు.

    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com