తెలంగాణలో 6 విమానాశ్రయాలకు ఏర్పాట్లు
- August 14, 2019తెలంగాణ రాష్ట్రంలో 6 విమానాశ్రయాలు ఏర్పాటుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పథకం ఉడాన్ కింద వీటిని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పెద్దపల్లి, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కొత్తగూడెంలో విమానాశ్రయాలు నిర్మించాలని అంగీకరించింది. పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇప్పటికే ఎయిర్ స్ట్రిప్లున్న సంగతి తెలిసిందే. వరంగల్ ఎయిర్ స్ట్రిప్ను సైనిక అవసరాలకు నిర్మించారు.
ప్రతిపాదించిన 6 ప్రాంతాల్లో అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్ పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా (AAI) కన్సల్టెన్సీగా నియమించింది. అధికారులు పర్యటించి ఎయిర్ పోర్టులు నిర్మాణ అవసరాలపై స్టడీ చేయనున్నారు. సెప్టెంబర్ నెలాఖరు వరకు ప్రభుత్వానికి నివేదిక అందచేయనున్నారు. నివేదిక ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ విధానాన్ని రూపొందిస్తాయి. ఇప్పటికే వరంగల్, కొత్తగూడెం, మహబూబ్ నగర్ జిల్లాల్లో ప్రతిపాదించిన ప్లేస్లను పరిశీలించింది.
రెండో దశలో ఈనెల 19 నుంచి మూడు రోజుల పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో అధికారుల బృందం పర్యటించనుంది. ఆయా ప్రాంతాల్లో గడిచిన 5-6 దశాబ్దాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి.., ట్రాఫిక్ డిమాండ్ ఏ స్థాయిలో ఉంటుంది.., విమానాశ్రయాల అవసరం ఉందా.., ఎంత స్థలం అవసరం తదితర వాటిపై అధికారులు పరిశీలన చేయనున్నారు.
తాజా వార్తలు
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం