ఒమాన్ " ఇ - 44" మార్గంలో ఇక విదేశీయులకు అనుమతి లేదు
- January 07, 2016
ఎమరేట్స్ నుంచి భూమార్గం ద్వారా ఒమాన్ చేరేందుకు ఫీజులను క్రమబద్దీకరించారు. దీని ప్రకారం ఒక వ్యక్తికి 30 దినార్లు ఖర్చుగా నిర్ణయించారు. ఈ మార్గంలో గల్ఫ్ దేశాల సమఖ్యకు చెందిన జాతీయులు ఈ రహదారి మీదుగా తమ తమ ప్రయాణాలను కొనసాగించవచ్చు.
అయితే , ఇదే మార్గంలో ప్రయాణించే విదేశీయులకు అనుమతి లేదు. ఈ దారి ఒమాన్ సరిహద్దు ప్రాంతమైన మాదం మరియు హత్తాకు చేరుతుంది. ఈ మార్గానికి ప్రత్యామ్నయంగా షార్జా కల్బ మీదుగా హత్తాకు చేరుకోవచ్చు. ఈ మార్గంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని అధికారులు తెలియచేస్తున్నారు. తమ సూచనను కాదని , మాదం దారి మీదుగా విదేశీయులు ఎవరైనా ప్రయాణిస్తే, చెక్ పోస్ట్ వద్ద ఒమాన్ అథారిటీ సిబ్బంది నిర్దయగా ఆపివేయబడి , తిరిగి వెనక్కి పంపివేయబడతారని తెలిపారు. షార్జా కల్బ ప్రాంతాలకు చేరుకోవడానికి మరో దారి ఏమిటంటే, ఆ మాదం మార్గంలో ఎడమ వైపునకు తిరిగి " ఇ - 55 " మార్గం ద్వారా ' అల్ మలైహ ' మీదుగా ముందుకు ప్రయాణించిన తర్వాత ' శావ్క ' మార్గ సూచీ బొర్దును గమనించవచ్చు. అక్కడ కుడి వైపునకు తిరిగి హత్తా 44 ద్వారా , 25 నుంచి 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించి " ఆల్ వజజహ్ " సరిహద్దుకు చేరుకోవచ్చు. ఇది దాదాపు అరగంట ప్రయాణ భారమైనా మంచిది. ఎందుకంటే, అనుమతి లేని ' మాదం మరియు హత్తాకు ' 2 గంటల 45 నిమిషాలు ఏకధాటిగా ప్రయాణించి అక్కడ సరిహద్దు సిబ్బంది వెనక్కి పంపడం కన్నా హత్తా 44 ద్వారా గమ్యం చేరుకోవడం మంచిదని అధికారులు వివరిస్తున్నారు. సెలవులలో, వారాంతంలో అత్యధిక విదేశీయులు ఒమాన్ లో అక్రమంగా జరుగుతున్న ప్రవేశాలను నిలువరించేందుకు ఈ చర్యలను తీసుకుంటనట్లు వారు తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







