వాట్స్ యాప్ లో నాలుగు సరికొత్త ఫీచర్లు
- August 19, 2019
సాధారణ మెసేజ్ లతో పాటు ఫోటోలు, వీడియో, ఆడియో క్లిప్పింగ్ లను స్నేహితులు, బంధుమిత్రులతో క్షణాల్లో పంచుకునేందుకు సహకరించే వాట్స్ యాప్, ఇప్పుడు మరో నాలుగు కొత్త ఫీచర్లను దగ్గర చేయనుంది. వాటిల్లో అతి ముఖ్యమైనది, ఎవరైనా క్రియేట్ చేసిన గ్రూపుల్లో ఒకరి అనుమతి లేకుండా చేర్చడం ఇకపై జరగబోదు. ఎవరో క్రియేట్ చేసే గ్రూపులో తమంతట తామే చేరిపోతున్నామని, తమకు ఇష్టం లేకుండానే ఇది జరిగిపోతోందని పలువురు ఫిర్యాదులు చేయడంతో.. వాట్స్ యాప్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరైనా, ఎవరినైనా ఏదైనా గ్రూప్ లో చేరిస్తే, 72 గంటల్లోగా దాన్ని చూసి, యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదే సమయంలో కస్టమర్ తన నంబర్ ను గ్రూప్స్ లో యాడ్ చేయవద్దు అనే ఆప్షన్ ను కూడా వాట్స్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. తిరిగి ఆ ఆప్షన్ ను అన్ లాక్ చేసేంత వరకూ మరే గ్రూప్ లోనూ కస్టమర్ యాడ్ కాడు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్న స్మార్ట్ ఫోన్లలో వేలిముద్ర సాయంతో అన్ లాక్ చేసుకునే సదుపాయాన్ని, స్పామ్ మెసేజ్ లను సులువుగా గుర్తించేందుకు 'ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డెడ్' పేరిట సరికొత్త ఫీచర్ ను కూడా వాట్స్ యాప్ ప్రారంభించింది. వరుసగా వచ్చే వాయిస్ మెసేజ్ లను ఒకదాని తరువాత ఒకటి వినేందుకు వీలుగా మరో సరికొత్త ఫీచర్ ను తయారు చేస్తున్నట్టు కూడా వాట్స్ యాప్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







