ప్రముఖ సంగీత దర్శకుడు ఖయ్యం కన్నుమూత
- August 20, 2019
ముంబై : బాలీవుడ్ సంగీత దర్శకుడు మహ్మద్ జహూర్ ఖయ్యం సాబ్ సోమవారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో ఖయ్యం బాధపడుతూ ముంబైలోని సుజయ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో గుండెపోటు రావడంతో ఖయ్యం మఅతి చెందారు. బాలీవుడ్లో ఖయ్యం ఎన్నో చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అందులో కభీ కభీ, సూరి, ఉమ్రావో జాన్, రజియా సుల్తాన్, బజార్ చిత్రాలు ప్రసిద్ధి చెందాయి. ఉమ్రావో జాన్ సినిమాకుగాను ఖయ్యం కు జాతీయ అవార్డు లభించింది. 2007 వ సంవత్సరంలో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. సినిమా పరిశ్రమకు ఖయ్యం చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2011 లో పద్మభూషణ్ పురస్కారంతో ఖయ్యం ను సత్కరించింది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







