అరెస్ట్కు సీబీఐ రంగం సిద్ధం
- August 21, 2019
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరంకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇది ఇలావుంటే, ఢిల్లీలోని చిదంబరం ఇంటికి వెళ్లిన సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆయన ఇంట్లో లేకపోవడంతో వెనుతిరిగారు. ఆ తర్వాత వెళ్లిన మరో అధికారుల బృందం చిదంబరం ఇంటికి నోటీసులు అంటించింది.
రెండు గంటల్లోపు సీబీఐ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. బెయిల్ పిటిషన్ రద్దు కావడం, సీబీఐ నోటీసుల నేపథ్యంలో చిదంబరం అరెస్టు తప్పదేమోనన్న చర్చ జరుగుతోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో చిదంబరం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా ప్రతికూలంగా తీర్పు చెబితే చిదంబరం జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
తాజా వార్తలు
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్







