రాఫెల్ యుద్ధ విమానాన్ని స్వీకరించనున్న రాజ్ నాథ్ సింగ్
- August 22, 2019
న్యూఢిలీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా లు తొలి రాఫెల్ ను స్వీకరించబోతున్నారు. దీంతో భారత వాయుసేన మరింత బలోపేతం కానుంది. ఫ్రెంచ్ ఏవియేషన్ సంస్థ డస్సాల్ట్ నుంచి తొలి రాఫెల్ యుద్ధ విమానం సెప్టెంబర్ 20న భారత్ కు అందనుంది. ఈ విమానాన్ని స్వీకరించడానికి రాజ్ నాథ్, ధనోవాలతో పాటు పలువురు ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు ఫ్రాన్స్ కు వెళ్లనున్నారు. మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ కు ఫ్రాన్స్ అందిచనుంది. 2020 మే నుంచి మిగిలిన విమానాలు ఒక్కొక్కటిగా భారత్ కు చేరుతాయి. ప్రస్తుతం ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్ వినియోగిస్తున్న రాఫెల్ యుద్ధ విమానాల కంటే భారత్ కు అందనున్న విమానాలు మరింత ఆధునికమైనవని అధికారులు తెలిపారు. ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో మన పైలట్లు కొందరు ఇప్పటికే ఆధునాతన రాఫెల్ యుద్ధ విమానాలపై ట్రైనింగ్ పొందారు. 2020 వరకు మొత్తం 24 మంది పైలట్లకు మూడు బ్యాచ్ లలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!







