రాఫెల్ యుద్ధ విమానాన్ని స్వీకరించనున్న రాజ్ నాథ్ సింగ్
- August 22, 2019న్యూఢిలీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా లు తొలి రాఫెల్ ను స్వీకరించబోతున్నారు. దీంతో భారత వాయుసేన మరింత బలోపేతం కానుంది. ఫ్రెంచ్ ఏవియేషన్ సంస్థ డస్సాల్ట్ నుంచి తొలి రాఫెల్ యుద్ధ విమానం సెప్టెంబర్ 20న భారత్ కు అందనుంది. ఈ విమానాన్ని స్వీకరించడానికి రాజ్ నాథ్, ధనోవాలతో పాటు పలువురు ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు ఫ్రాన్స్ కు వెళ్లనున్నారు. మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ కు ఫ్రాన్స్ అందిచనుంది. 2020 మే నుంచి మిగిలిన విమానాలు ఒక్కొక్కటిగా భారత్ కు చేరుతాయి. ప్రస్తుతం ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్ వినియోగిస్తున్న రాఫెల్ యుద్ధ విమానాల కంటే భారత్ కు అందనున్న విమానాలు మరింత ఆధునికమైనవని అధికారులు తెలిపారు. ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో మన పైలట్లు కొందరు ఇప్పటికే ఆధునాతన రాఫెల్ యుద్ధ విమానాలపై ట్రైనింగ్ పొందారు. 2020 వరకు మొత్తం 24 మంది పైలట్లకు మూడు బ్యాచ్ లలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్
- గాల్లో ఢీకొన్నరెండు హెలీకాప్టర్లు..10 మంది మృతి
- గ్లోబల్ విలేజ్ బంపరాఫర్..ఇక వారికి ఉచితం..!
- 3వేలకు పైగా చిల్డ్రన్ స్వీట్స్ సీజ్
- బహ్రెయిన్ లో డిజిటల్ తరగతుల పొడిగింపు
- వారికి వీసా ఓవర్స్టే జరిమానాలు లేవు..!
- 'క్షమాభిక్ష'ను వినియోగించుకున్న 6,300 మంది ప్రవాసులు
- సుడాన్ ఆరోపణలను ఖండించిన యూఏఈ
- నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలి: ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి