పారిస్ లో మోడీకి ఘన స్వాగతం

- August 22, 2019 , by Maagulf
పారిస్ లో మోడీకి ఘన స్వాగతం

పారిస్:ఐదు రోజుల పాటు మూడు దేశాల్లో అధికారిక పర్యటనలో భాగంగా మొదటగా ఇవాళ(ఆగస్టు-22,2019) పారిస్ చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. పారిస్ లోని చార్లెస్ డీ గాలే ఎయిర్ పోర్ట్ లో మోడీకి ఫ్రెంచ్ విదేశాంగ శాఖ మంత్రి జేవై లీడ్రెయిన్, అక్కడి అధికారులు,నాయకులు ఘనస్వాగతం పలికారు. భారత సంతతి ప్రజలకు మోడీకి ఘన స్వాగతం పలికారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రోన్,ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎడోర్డ్ ఫిలిప్పీతో మోడీ సమావేశమై ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. వివిధ కార్యక్రమాల్లో మోడీ పాల్గొననున్నారు. యూఏఈ,బహ్రెయిన్ లో కూడా మోడీ పర్యటించనున్నారు. ఆయా దేశాల అధ్యక్షులతో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com