బాలయ్య 'లయన్' పైరసీ సీడీలు పట్టివేత
- May 15, 2015
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 'లయన్' చిత్రం అలా విడుదలవ్వడం ఆలస్యం...ఇలా పైరసీ సీడీలు మార్కెట్లోకి వచ్చాయి. తాజాగా ఒంగోలులోని సీడీ షాపులపై పోలీసులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో లయన్ సినిమా పైరసీ సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.సీడీ షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.లయన్ పైరసీ వెనక..సౌతిండియా పైరసీ మాఫియా హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ఈ పైరసీ సీడీలు ఇప్పటికే పంపిణీ అయినట్లు సమాచారం. అదే నిజమైతే పైరసీ కారణంగా నిర్మాతలు నష్టపోవడం ఖాయం. సినిమా విషయానికొస్తే..'లయన్' చిత్రం ఓపెనింగ్స్ భారీగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 5.5 కోట్ల మేర వసూలు చేసినట్లు సమాచారం.ఈ చిత్రం ద్వారా సత్య దేవ దర్శకుడిగా పరిచయం అయ్యారు.రుద్రపాటి రామరావు నిర్మాత.బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్రాజ్, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట్ ప్రసాద్, కూర్పు: గౌతంరాజు
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







