తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసిన ఇండియన్‌ ఎంబసీ

- August 26, 2019 , by Maagulf
తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసిన ఇండియన్‌ ఎంబసీ

కువైట్‌: ఎంబసీ అధికారుల పేరుతో కొందరు వ్యక్తులు భారత పౌరులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారనీ, ఫోన్‌ ద్వారా ఈ మోసాలు చేస్తున్నారనీ ఇండియన్‌ ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది. 'ఇండియన్‌ ఎంబసీ పేరుతో ఎవరూ భారత పౌరులకు ఫోన్‌ చేసే అకవాశం వుండదనీ, ఒకవేళ అలాంటి ఫోన్‌ వస్తే వెంటనే ఎంబసీ కార్యాలయాన్ని సంప్రదించాలని ఎంబసీ అధికారులు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియన్‌ ఎంబసీ అధికారులు ఫోన్‌ చేసి, డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్‌ చేయమని చెప్పదని ఎంబసీ పేర్కొంది. అన్ని ముఖ్యమైన విషయాలూ ఇండియన్‌ ఎంబసీ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు పొందుపరచ్చబడ్తాయనీ, వాటిని చూసి మోసాలను గుర్తించాలని ఎంబసీ సూచించింది. 

--షేక్ బాషా(కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com