యూఏఈ విజిట్ వీసా కన్ఫ్యూజన్
- January 08, 2016
విజిట్ వీసా పునరుద్ధరణపై కన్ఫ్యూజన్, చాలామంది ప్రయాణీకులపై పడింది. ఉద్యోగార్ధులు సైతం ఈ విధానంతో ఆందోళన చెందుతున్నారు. విజిట్ వీసా ఉన్నవారు తమ వీసా స్టేటస్ని మార్చుకోవడానికి 570 దిర్హామ్లు చెల్లిస్తే సరిపోతుందనే నిబంధననపై గందరగోళం కొనసాగుతోంది. ఈ నిబంధన విషయంలో ఇంకా అధికారిక సమాచారం రాలేదని ట్రావెల్ ఏజెంట్స్ చెబుతుండడంతో, విజిట్ వీసా ఇబ్బందులు తీవ్రమయ్యాయి. ఈ గందరగోళం నడుమ ప్రయాణాల్ని రద్దు చేసుకోవడమే మంచిదని చాలామంది భావిస్తున్నారు. ఈ గందరగోళం కారణంగా ప్రయాణాల్లో 10 నుంచి 15 శాతం తగ్గుదల గడచిన వారంలో నమోదయినట్లు సమాచారమ్. అయితే, అబుదాబీ నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం సీనియర్ ట్రావెల్ కన్సల్టెంట్ బిలాల్ చౌదరి మాట్లాడుతూ, కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రయాణీకులను గందరగోళానికి గురిచేస్తున్నాయనీ, ఆ కన్ఫ్యూజన్ వల్ల ప్రయాణాల్లో తగ్గుదల కనిపించినా, క్రిష్ ఐలాండ్ సహా పaలు ప్రాంతాలకు బుక్ అయిన టిక్కెట్లలో ఎలాంటి క్యాన్సిలేషన్స్ లేవని చెప్పారు.
--శాలెం బాబు(అడ్వకేట్,దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







