ఆ విషయంలో తెలంగాణ నెంబర్ వన్:గవర్నర్
- September 10, 2019
హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వ పథకాలు, విధానాలపై గవర్నర్ తమిళసై.. ప్రశంసల వర్షం కురిపించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు పథకాలను అద్భుతమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మానవ నిర్మిత అద్భుతమంటూ కితాబిచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో తాను భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు గవర్నర్ తమిళసై.
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు పథకాలు బాగున్నాయన్నారు. బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటుందని, దేశంలోనే గొప్ప రాష్ట్రంగా నిలిచిపోతుందని గవర్నర్ ఆకాంక్షించారు. రాష్ట్రం 14.84 శాతం వృద్ధి రేటు సాధించిందని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి చేపడుతున్న 30 రోజుల ప్రణాళిక ఓ మంచి కార్యక్రమం అని ప్రశంసించారు. పాలమూరు-రంగారెడ్డి పథకంతో కృష్ణా జలాలను గరిష్ట స్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నామని వివరించారు. ఐటీ ఉత్పత్తులు, ఎగుమతుల్లో హైదరాబాద్ రికార్డులు నెలకొల్పిందన్నారు గవర్నర్. సేవల రంగంలో హైదరాబాద్ అద్భుతంగా పురోగతి కనిపిస్తుందన్నారామె. దేశంలో హైదరాబాద్ మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







