కాశ్మీర్ పై చర్చలు కుదరవన్న పాక్ విదేశాంగ మంత్రి...మధ్యవర్తిత్వం కోసం వెంపర్లాట
- September 12, 2019
ఇస్లామాబాద్: కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి రద్దు చేయడాన్ని పాకిస్థాన్ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. వీలుచిక్కినప్పుడల్లా దీనిపై ఏదో ఒక చోట మాట్లాడుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య చర్చలు సాధ్యం కావని, మధ్యవర్తిత్వం కావాలని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మహమూద్ ఖురేషీ వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఐరాస మానవ హక్కుల మండలి (యూఎన్హెచ్ఆర్సీ) 42వ సదస్సు వేదికగా పాక్ ఆరోపణలను భారత్ తిప్పికొట్టిన విషయం తెలిసిందే. అయితే, రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, చర్చల ద్వారా అవి పరిష్కారమవుతాయని ఐరాస పేర్కొంది. ఆ వ్యాఖ్యలను పాక్ మంత్రి ఉటంకిస్తూ చర్చల వల్ల ఫలితమేమీ ఉండదన్నారు.
'భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు, చర్చలు సాధ్యం కాని పని. ఇరు దేశాల ఉద్రిక్తతలు మధ్య వర్తిత్వం ద్వారానే అది పరిష్కారమవుతాయి' అని ఖురేషీ అన్నారు. భారత్ మాత్రం ఈ విషయంలో ఎప్పటి నుంచో స్పష్టతతో ఉంది. అంతర్జాతీయ సమాజం కూడా కశ్మీర్ అంశాన్ని భారత్ అంతర్గత వ్యవహారంగానే పరిగణిస్తోంది. పాక్ మాత్రం మూడో వ్యక్తి ప్రమేయాన్ని కోరుతోంది.
ఇటీవల జరిగిన యూఎన్హెచ్ఆర్సీ సదస్సులో పాక్ ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది. కశ్మీర్ పరిస్థితులపై ఈ మండలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ దర్యాప్తు జరిపించాలన్న పాక్ డిమాండ్ను భారత్ తోసిపుచ్చింది. ఇది భారత్ అంతర్గత వ్యవహారమని, ఇతరుల జోక్యాన్ని ఆమోదించబోమని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







