హైదరాబాదీని చంపిన పాకిస్తానీ
- September 13, 2019
లండన్:అనుమానం పెనుభూతమైంది. తన భార్యతో వివేహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో పాకిస్థానీ వ్యక్తి హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తిని అంతమొందించాడు.. దీంతో అతనికి యావజ్జీవ శిక్ష విధించింది లండన్ కోర్టు.. హైదరాబాద్ కు చెందిన నదీమ్ ఉద్దీన్ హమీద్ మొహమ్మద్ (26) కొన్నేళ్లుగా లండన్ లో ఉంటున్నాడు. అతనికి ఏడాది కిందటే వివాహం జరిగింది. అయితే అతను పనిచేస్తున్న కంపెనీలో సహోద్యోగి పెర్విజ్ (27)తో పరిచయం ఏర్పడింది. పెర్విజ్ పాకిస్థాన్ కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం అతను యూకే పౌరసత్వం కలిగివున్నాడు. అప్పుడప్పుడు మొహమ్మద్..ఇంటికి వస్తుండటంతో తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని పెర్విజ్ అనుమాన పడ్డాడు.
దాంతో ఈ ఏడాది మే లో మొహమ్మద్ ను పదునైన కత్తితో అందరూ చూస్తుండగానే లండన్ పురవీధుల్లో దారుణంగా నరికి చంపాడు. అతను మరణించేనాటికి మృతుడి భార్య ఎనిమిది నెలల గర్భిణీ. ఈ కేసులో తీర్పు వెల్లడించిన కోర్టు.. నిందితుడు పెర్విజ్ కు యావజ్జీవ శిక్ష విధించింది. అంతేకాదు ఒకవేళ పెరోల్ కావాలనుకుంటే అతను కనీసం 22 సంవత్సరాల శిక్ష అనుభవించాలని కోర్టు స్పష్టం చేసింది. పదునైన ఆయుధాన్ని కలిగి ఉన్నందుకు మరో 18 నెలల శిక్ష కూడా విధించింది. ‘మీ భార్య, కుటుంబ సభ్యులు, మరణించిన మొహమ్మద్లు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావని ఎంత చెప్పినా వినలేదు’ అని తీర్పులో పేర్కొంది లండన్ కోర్టు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







