ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ. 6.53లక్షల ఫైన్!!
- September 15, 2019ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ లారీ డ్రైవర్కి దిమ్మదిరిగిపోయే రీతిలో ఫైన్ వేశారు ఒడిశా రవాణా శాఖ అధికారులు. మొత్తం ఏడు నియమాల ఉల్లంఘనలకు గానూ దిలీప్ కర్తా అనే డ్రైవర్కు సంబల్పూర్ ఆర్టీఏ అధికారులు చలానా జారీ చేశారు. ఆ చలానా చూసి షాక్ అయ్యాడు దిలీప్. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
నాగాలాండ్కు చెందిన ఆ లారీకి పత్రాలు సరిగాలేవు. గత ఐదేళ్లుగా రోడ్డు ట్యాక్స్ కట్టడంలేదు. వస్తువులు తరలించే వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకుంటున్నాడు. ఇలా తదితర కారణాలు చూపి ఆ లారీకి ఏకంగా రూ.6.53లక్షలు జరిమాన విధించారు. ఆ వాహనానికి వేసిన జరిమానాను చూసిన ట్రక్కు ఓనర్ శైలేష్ శంకర్ నోరెళ్లబెట్టాడు. అయితే ఇదంతా కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత జరిగింది కాదు. ఆగస్టు 10న జరిగిన ఘటన ఇది. ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్