స్ప్రింక్లర్ వ్యవస్థను వైఫై ఇంటర్నెట్తో
- January 09, 2016
ఒక్క రోజు నీరు రాకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం. నీటి వృథాతో వచ్చే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. భవిష్యత్తు బాగుండాలంటే నీటిని ఆదా చేయాల్సిందే. దీన్ని గమనించిన అమెరికాలోని డెన్వర్కు చెందిన రషియో సంస్థ వైఫైతో నడిచే స్మార్ట్ స్ప్రింక్లర్ల వ్యవస్థను రూపొందించింది. ఇవి 30 శాతం నీటిని ఆదా చేయడం విశేషం. స్మార్ట్ఫోన్ సాయంతో ఈ వ్యవస్థను నియంత్రించవచ్చు. స్ప్రింక్లర్ వ్యవస్థను వైఫై ఇంటర్నెట్తో అనుసంధానిస్తారు. నియంత్రణకు సంబంధించిన యాప్ను ఫోన్లో ఇన్స్టాల్ చేస్తారు. దీంతో ఇంటి వద్దనుంచే వీటిని నియంత్రణ సాధ్యమవుతుంది. దీని సాయంతో సీజన్ల వారీగా నీటిని విడుదల చేయవచ్చు. వాతావరణాన్ని పరిశీలించి వర్షం వస్తే దానంతట అదే ఆగిపోతుంది. భూమిలో నీరు ఇంకిన శాతం గమనిస్తుంది. ఆవిరి కాగానే మళ్లీ నీటిని విడుదల చేస్తుంది. 2012లో అమెరికాలోని కొలరాడోలో వచ్చిన కరవును చూసి చలించిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు క్రిస్ క్లెయిన్, ఫ్రాన్జ్ గార్సోంబ్కేలు ఈ వ్యవస్థను రూపొందించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







