బోటు ప్రమాదంపై మోదీ దిగ్బ్రాంతి..
- September 15, 2019
ఢిల్లీ:గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.. పరిస్థితిని సమీక్షించిన ప్రధాని సహాయక చర్యలను ముమ్మరం చేయాలనీ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈమేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఈ రోజు జరిగిన బోటు ప్రమాదం ఒక అతి బాధాకరమైన ఘటన. మృతుల కుటుంబాలకు నా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.’ అంటూ పేర్కొన్నారు ప్రధాని. ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సీఎం జగన్ తో ఫోనులో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు డీజీపీ గౌతమ్ సవాంగ్ ద్వారా సహాయక చర్యల గురించి ఆరా తీస్తున్నారు. కాగా బోటులో మొత్తం 71 మంది ఉన్నట్టు తాజాగా తెలిసింది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







