మాజీ స్పీకర్ కోడెల అంత్యక్రియలు పూర్తి
- September 18, 2019అశ్రునయనాల మధ్య మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అంత్యక్రియలు ముగిశాయి. స్వర్గపురిలో శివప్రసాద్ రావు చితికి నిప్పంటించారు ఆయన కుమారుడు శివరాం. అంతకుముందు అంతిమయాత్రలో భారీగా అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నారా లోకేష్, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు తదితరులు కోడెల అంతిమయాత్రలో పాల్గొన్నారు. కోడెల అంతిమయాత్ర సందర్బంగా నరసరావుపేట వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ‘పల్నాటి పులి’ కోడెల అమర్ రహే.. అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరిచారు అభిమానులు. తమ అభిమాన నేత కోడెల ఇకలేరన్న వార్తను నరసరావుపేట ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. బుధవారం నరసరావుపేటలో స్వచ్ఛందంగా బంద్ పాటించారు ప్రజలు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ