మాజీ స్పీకర్ కోడెల అంత్యక్రియలు పూర్తి
- September 18, 2019
అశ్రునయనాల మధ్య మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అంత్యక్రియలు ముగిశాయి. స్వర్గపురిలో శివప్రసాద్ రావు చితికి నిప్పంటించారు ఆయన కుమారుడు శివరాం. అంతకుముందు అంతిమయాత్రలో భారీగా అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నారా లోకేష్, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు తదితరులు కోడెల అంతిమయాత్రలో పాల్గొన్నారు. కోడెల అంతిమయాత్ర సందర్బంగా నరసరావుపేట వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ‘పల్నాటి పులి’ కోడెల అమర్ రహే.. అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరిచారు అభిమానులు. తమ అభిమాన నేత కోడెల ఇకలేరన్న వార్తను నరసరావుపేట ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. బుధవారం నరసరావుపేటలో స్వచ్ఛందంగా బంద్ పాటించారు ప్రజలు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







