ETCA మరియు UAE జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకల ఫ్లైయర్ విడుదల
- September 18, 2019
యూ.ఏ.ఈ:ETCA మరియు UAE జాగృతి సంయుక్తంగా నిర్వహిస్తున్న తొమ్మిదవ బతుకమ్మ వేడుకలకు సంబంధించిన ఫ్లైయర్ ఆవిష్కరణ మంగళవారం 17 సెప్టెంబర్ 2019 రోజున ETCA ప్రెసిడెంట్ సత్యం రాధారపుమరియు ప్రముఖ వ్యాపార వేత్త తోట రామ్ కుమార్ చేతులమీదుగా జరిగింది.
ఈ సమావేశంలో వచ్చే నెలలో జరగబోయే బతుకమ్మ సంబరాలకు సంబంధించిన కార్యక్రమ విశేషాలను ఉద్దేశించి అధ్యక్షులు సత్యం రాధారపు గారు మరియు ఈటీసీఎ వ్యవస్థాపక అధ్యక్షులైన కిరణ్ కుమార్ పీచర గారు మాట్లాడుతూ గత సంవత్సరాల్లో కంటే కూడా ఈ సంవత్సరం మరింత గొప్పగా నిర్వహించడానికి సంఘం పటిష్టమైన ప్రణాళికతో సిద్ధంగా ఉందని, అందుకు గాను సభ్యులకు శాఖల వారీగా బాధ్యతలను అప్పగించడం జరిగిందని తెలిపారు. షార్జా లోని స్కై లైన్ యూనివర్సిటీని వేదికగా చేస్కొని అక్టోబర్ 04 శుక్రవారం రోజున సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు ఆహ్లాదకరమైన వాతావరణంలో, సుమారు 10000 మంది భారీ జన సమీకరణ నడుమ తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా జరుగుతాయని వెల్లడించడం జరిగింది.
ఈ సంబరాల్లో అందమైన బతుకమ్మల పోటీలు నిర్వహించబడునని, UAE లో ఉంటున్న అందరు తెలంగాణ ప్రవాసులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో UAE కి సంబంధించిన ప్రముఖ తెలంగాణ వ్యాపారవేత్తలు మసీఉద్దిన్ మొహమ్మద్, రాంచందర్ రెడ్డి, గబ్బుల బాలయ్య, గోవర్ధన్ రెడ్డి, కిష్టయ్య , జయంత్ రెడ్డి, శంకర్ , సుధాకర్ రెడ్డి, వేణు , ఇర్షాద్, ప్రతాప్, వంశీ, మురళీ, పిట్టల రాజయ్య మరియు ETCA వ్యవస్థాపకులు కిరణ్ కుమార్ పీచర, అరవింద్ రాగం, భరద్వాజ్ వాల, నరేష్ కుమార్ మాన్యం, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
_1568813851.jpg)
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







