మరో కీలక నిర్ణయం తీసుకున్న భారత కేంద్ర ప్రభుత్వం

- September 20, 2019 , by Maagulf
మరో కీలక నిర్ణయం తీసుకున్న భారత కేంద్ర ప్రభుత్వం

భారత కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ చందాదారుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 2017–18 కాలానికి 8.55గా ఉన్న వడ్డీ రేటును.. 8.65 శాతానికి పెంచి ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీంతో 2018–19 సంవత్సరానికి గాను 6 కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఇకపై వచ్చే క్లెయిమ్‌లను కూడా 8.65 శాతం వడ్డీతో సెటిల్‌ చేయాలనీ అధికారులను ఆదేశించింది. కాగా ఈపీఎఫ్‌ రేటును 8.65 శాతానికి పెంచుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం అమలుపరిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com