యూఏఈలో గోల్డ్ కార్డ్ పొందిన డా.జులేఖా దౌద్
- September 20, 2019
దుబాయ్: యూఏఈ తదితర దేశాల్లో శాశ్వత పౌరసత్వం పొందిన విదేశీయులకు ఇచ్చే గోల్డ్కార్డును తొలిసారిగా ఓ భారతీయ మహిళ పొందారు.జులేఖా దౌద్(81) మహారాష్ట్ర లోని నాగపూర్ కి చెందిన వారు.జులేఖా దౌద్ యూఏఈ లో డాక్టర్ గా వృత్తి ప్రారంభించి జులేఖా హాస్పిటల్ని స్థాపించారు.ఈ గోల్డ్కార్డుల విధానాన్ని అమలు చేయడం మొదలెట్టగానే.. తొలి గోల్డ్కార్డును దుబాయ్ లో వ్యాపారం చేస్తున్న భారత వ్యాపారవేత్తకే ఇచ్చారు. ఇప్పడు కూడా జులేఖా దౌద్ అనే ఓ డాక్టరుకు ఈ కార్డు అందజేశారు. వైద్యరంగానికి ఆమె చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు అధికారులు తెలిపారు.
ప్రభుత్వం గోల్డ్కార్డు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. శాశ్వత పౌరసత్వం పొందిన విదేశీయులకు అమెరికా గ్రీన్కార్డులు ఇస్తుందని తెలిసిందే. ఈ తరహాలోనే తమ దేశంలోని వలసదారులకు కూడా ఇక్కడ శాశ్వత పౌరసత్వం పొందే అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని రూపొందించింది.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









