పాత ట్రాఫిక్ జరిమానాలకు 50 శాతం రాయితి
- January 09, 2016
గత ఏడాది బకాయి పడిన పాత ట్రాఫిక్ జరిమానాలకు 50 శాతం రాయితీను వాహనదారులు ఇకపై చెల్లిస్తే సరిపోతుందని ట్రాఫిక్ విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ అవకాశం ఈ ఏడాది ఏప్రిల్ 7 వ తేది లోపు మాత్రమె వర్తిస్తుందని , గత ఏడాది డిసెంబర్ 31 వ తేది లోపున జరిమానాలు విధించబడిన వాహనదారులకి మాత్రమె వర్తిస్తుందని డైరెక్టర్ జనరల్ అఫ్ ట్రాఫిక్ తెలిపారు. 3 నెలల గడువులోపు ఈ సదుపాయంను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రాదర్ వ్యవస్థ ద్వారా నమోదు కాబడిన అన్ని ట్రాఫిక్ అన్ని నిబంధనలు ఈ పరిధి లోనికి వస్తాయని తెలిపారు. బకాయి పడిన పాత ట్రాఫిక్ జరిమానాలను వాహనదారులు ' మొఇ ఈ- చానల్స్ , మొఇ వెబ్ పోర్టల్ , మెత్రాష్ తో మొబైల్ యాప్స్ స్వయం సేవా కిఒస్కస్, అలాగే, అన్ని ట్రాఫిక్ విభాగ కౌంటర్ల ద్వారా చెల్లించవచ్చు. త్వరలో కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమలులో రానున్న నేపధ్యంలో పాత ట్రాఫిక్ జరిమానాలను త్వరితగతిన ముగించేందుకు 50 శాతం రాయతిని ట్రాఫిక్ విభాగం ప్రకటించింది. ప్రజలందరు రానున్న నూతన ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా పలు రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, విలువైన ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ట్రాఫిక్ విభాగంతో సహకరించాలని డైరెక్టర్ జనరల్ అఫ్ ట్రాఫిక్ తెలిపారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







