యూఏఈలో భారత కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ పర్యటన
- September 24, 2019
భారత కేంద్ర మంత్రి పియుష్ గోయెల్, యూఏఈలో రెండు రోజుల పర్యటన కోసం విచ్చేశారు. ఆయనకు ఇండియన్ పీపుల్స్ ఫోరమ్ యూఏఈ డెలిగేషన్ స్వాగతం పలికింది. దుబాయ్ ఎక్స్పో 202లో ఇండియా పెవిలియన్ని ఆయన ప్రారంభించారు. ఈ పర్యటన సందర్భంగా పియుష్ గోయెల్తో ఇండియన్ పీపుల్స్ ఫోరమ్ యూఏఈ డెలిగేషన్ సమావేశమయ్యింది. ఐపీఎఫ్ ప్రెసిడెంట్, నేషనల్ కన్వీనర్ భూపేంద్ర కుమార్, ఐపీఎఫ్ యాక్టివిటీస్ గురించి వివరించారు. కాన్సుల్ వ్యవహారాలు, కల్చర్ ఎక్స్ఛేంజ్ వంటి విషయాలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. ఐపీఎఫ్ దుబాయ్ ప్రెసిడెంట్ రమేష్ మన్నాథ్, వైస్ ప్రెసిడెంట్ జనగాం శ్రీనివాస్, ఐపీఎఫ్ షార్జా ప్రెసిడెంట్ విజయన్ నాయర్, జనరల్ సెక్రెటరీ సురేష్ కాశి, ఐపీఎఫ్ అజ్మన్ ప్రెసిడెంట్ రాధిష్ నాయర్, ఐపీఎఫ్ విమెన్ వింగ్ కో-ఆర్డినేటర్ శిల్పా నాయర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ, ఐపీఎఫ్ టీమ్ సేవల్ని కొనియాడారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)

తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







