శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి: టీటీడీ చైర్మన్‌

- September 25, 2019 , by Maagulf
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి: టీటీడీ చైర్మన్‌

తిరుమల : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు తెలిపారు. 7.5 లక్షల లడ్డూలను సిద్ధం చేశామన్నారు. తిరుమల మాడ విధుల్లో శ్రీవారి వాహన సేవలను సుమారు రెండు లక్షల మంది తిలకించేలా ఏర్పాట్లు చేశామన్నారు. 20 చోట్ల ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశామని, 9 వేల వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com