హైదరాబాద్:డ్రైవర్ మద్యం తాగలేదంటూ..
- September 27, 2019
హైదరాబాద్:గురువారం అర్ధరాత్రి చంపాపేట్ మినర్వా జంక్షన్ వద్ద ఓ మహిళ హల్ చల్ చేసింది. పోలీసులతో వాగ్వాదానికి దిగింది. తమ కారు డ్రైవర్ మద్యం తాగకపోయినా.. అనవసరంగా ఆపి డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించింది. అంతేకాదు.. నడిరోడ్డుపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. దీంతో స్థానికులు అడ్డుకున్నారు.
హైదరాబాద్ సింగరేణి కాలనీలో నివాసం ఉండే మునావత్ పద్మ, శ్రీను దంపతులు ఖమ్మం నుంచి వస్తున్నారు. చంపాపేట వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఉన్నారు. కారు ఆపి డ్రైవర్ కు బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయగా.. పాజిటీవ్ వచ్చింది. దీంతో కేసు నమోదుచేశారు. అయితే తమ డ్రైవర్ మద్యం సేవించలేదని.. డబ్బుల కోసం పోలీసులు డిమాండ్ చేశారని ఆరోపిస్తూ.. రోడ్డుపై పోలీసులో వాగ్వాదానికి దిగింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







