మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- September 20, 2025
మనామా: 30 ఏళ్ల మహిళకు బహ్రెయిన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడినందుకు హై క్రిమినల్ కోర్టు ఆమెకు 5 వేల బహ్రెయిన్ దినార్ల జరిమానా విధించింది. ఇదే సమయంలో మాదకద్రవ్యాలను ఉపయోగిస్తున్న తొమ్మిది మంది వ్యక్తులకు ఒక్కొక్కరికి ఒక సంవత్సరం జైలు శిక్ష, ఒక్కొక్కరికి వెయ్యి బహ్రెయిన్ దినార్ల చొప్పు జరిమానా విధించింది. పునరావాస కేంద్రం నుండి విడుదలైన తర్వాత సదరు మహిళ మాదకద్రవ్యాల పంపిణీని తిరిగి ప్రారంభించిందని, యాంటీ-నార్కోటిక్స్ విభాగానికి అందిన నిఘా సమాచారం మేరకు ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఆమె తన అపార్ట్మెంట్ నుంచి మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్నట్లు దర్యాప్తులో నిర్ధారించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?







