విశాఖలో రూ.5 వేల కోట్లతో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేయనున్న రిలయన్స్
- January 10, 2016
విశాఖపట్నం జిల్లాలోని రాంబిల్లిలో రూ.5 వేల కోట్లతో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ప్రకటించారు. విశాఖపట్నంలో ఆదివారం ప్రారంభమైన సీఐఐ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సులో ఆయన ప్రసంగించారు. రిలయన్స్ గ్రూపు రక్షణ రంగంలో పెట్టుబడులను విస్తరిస్తోందని, అందులో భాగంగా తూర్పు తీరంలో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామన్నారు. దీంతో పాటు రక్షణ రంగానికి అవసరమైన ఇతర పరికరాలు తయారు చేయడానికి మరో రూ.10 వేల కోట్లను దశల వారీగా పెట్టుబడి పెడతామన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని అనిల్ అంబానీ పారశ్రామిక వేత్తలకు పిలుపు నిచ్చారు. హైదరాబాద్లో బిజినెస్ స్కూల్ చంద్రబాబు హాయాంతోనే ఖ్యాతి పొందిదని అనిల్ అన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







