ఆర్టికల్- 370 రద్దుపై మరో ట్విస్ట్
- September 29, 2019
ఆర్టికల్-370 రద్దుపై మరో ట్విస్ట్. ఈ నిర్ణయంలో చట్టబద్దతను తేల్చడానికి సర్వోన్నత న్యాయస్థానం సిద్ధమైంది. ఆర్టికల్ 370 రద్దు న్యాయసమ్మతమో కాదో తేల్చడానికి ఐదుగురు సభ్యులతో రాజ్యాంగం ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ నేతృత్వంలో ఈ బెంచ్ను ఏర్పాటు చేశారు. అక్టోబర్ 1 నుంచి రాజ్యాంగ ధర్మాసనం, ఆర్టికల్ 370పై రద్దుపై విచారణ జరపనుంది.
కేంద్రంలోని మోదీ సర్కారు ఆగస్టు నెలలో కశ్మీర్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్మీర్కు సంబంధించిన అత్యంత కీలకమైన ఆర్టికల్-370ని రద్దు చేసింది. దాంతో పాటు జమ్మూకశ్మీర్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అక్టోబర్ 31 నుంచి రెండు యూటీలో మనుగడలోకి రానున్నాయి.
కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ వ్యాజ్యాలను పరిష్కరించడానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ రమణ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







