దుబాయ్లో రోడ్ యాక్సిడెంట్: 8 మంది మృతి, ఆరుగురికి గాయాలు
- September 30, 2019
దుబాయ్లో ఈ రోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, ఆరుగురికి గాయాలయ్యాయి. షార్జా వైపుగా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మిర్దిఫ్ సిటీ సెంటర్ ఎగ్జిట్కి దగ్గరలో జరిగిన ఈ ప్రమాదంలో 14 సీటర్ మినీ బస్, హెవీ లారీని ఢీకొంది. బస్ డ్రైవర్, ఏడుగురు ప్రయాణీకులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు ప్రయాణీకులకు తీవ్ర గాయాలు కాగా, నలుగురికి ఓ మోస్తరుగా గాయాలయ్యాయి. వీరందరినీ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారంతా ఆసియా జాతీయులేనని దుబాయ్ పోలీస్ వెల్లడించడం జరిగింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!