దుబాయ్లో రోడ్ యాక్సిడెంట్: 8 మంది మృతి, ఆరుగురికి గాయాలు
- September 30, 2019
దుబాయ్లో ఈ రోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, ఆరుగురికి గాయాలయ్యాయి. షార్జా వైపుగా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మిర్దిఫ్ సిటీ సెంటర్ ఎగ్జిట్కి దగ్గరలో జరిగిన ఈ ప్రమాదంలో 14 సీటర్ మినీ బస్, హెవీ లారీని ఢీకొంది. బస్ డ్రైవర్, ఏడుగురు ప్రయాణీకులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు ప్రయాణీకులకు తీవ్ర గాయాలు కాగా, నలుగురికి ఓ మోస్తరుగా గాయాలయ్యాయి. వీరందరినీ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారంతా ఆసియా జాతీయులేనని దుబాయ్ పోలీస్ వెల్లడించడం జరిగింది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







