కారు దొంగతనం: గంటలో రికవరీ
- October 01, 2019
దుబాయ్:ఇద్దరు దుబాయ్ పోలీసులు, దొంగిలించబడిన కారుని కేవలం గంట లోపే రికవరీ చేయగలిగారు. దుబాయ్ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, దొంగిలించబడిన టొయోటో కారు గురించిన సమాచారాన్ని అందుకోగానే, పోలీసులు రంగంలోకి దిగారు. అల్ ఖుసైస్ పోలీస్, ఈ ఆపరేషన్ చేపట్టింది. తన కుమారుడ్ని స్కూల్లో దించి వస్తున్న సమయంలో తన కారుని దొంగిలించినట్లు బాధిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. క్షణాల్లో కారు దొంగిలించబడిన సమాచారాన్ని పోలీస్ పెట్రోల్కి అందించగా, గంట వ్యవధిలోనే ఆ కారుని పోలీసులు పట్టుకోగలిగారు. ఇంజిన్ రన్నింగ్లో వున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కారు దిగి, దూరంగా వెళ్ళవద్దని అధికారులు ఈ సందర్బంగా వాహనదారులకు సూచించారు.
తాజా వార్తలు
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి







