కారు దొంగతనం: గంటలో రికవరీ
- October 01, 2019దుబాయ్:ఇద్దరు దుబాయ్ పోలీసులు, దొంగిలించబడిన కారుని కేవలం గంట లోపే రికవరీ చేయగలిగారు. దుబాయ్ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, దొంగిలించబడిన టొయోటో కారు గురించిన సమాచారాన్ని అందుకోగానే, పోలీసులు రంగంలోకి దిగారు. అల్ ఖుసైస్ పోలీస్, ఈ ఆపరేషన్ చేపట్టింది. తన కుమారుడ్ని స్కూల్లో దించి వస్తున్న సమయంలో తన కారుని దొంగిలించినట్లు బాధిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. క్షణాల్లో కారు దొంగిలించబడిన సమాచారాన్ని పోలీస్ పెట్రోల్కి అందించగా, గంట వ్యవధిలోనే ఆ కారుని పోలీసులు పట్టుకోగలిగారు. ఇంజిన్ రన్నింగ్లో వున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కారు దిగి, దూరంగా వెళ్ళవద్దని అధికారులు ఈ సందర్బంగా వాహనదారులకు సూచించారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్