ఎర్రగా మారిన రస్ అల్ ఖైమా కోస్ట్ వాటర్స్
- October 01, 2019
రస్ అల్ ఖైమాలోని ఫిషర్మెన్, ఎమిరేట్ కోస్ట్ నుంచి 12 మైళ్ళ మేర రెడ్ వాటర్ కనిపించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అథారిటీ, ఈ వ్యవహారంపై స్పందించి వివరణ ఇచ్చింది. రెడ్ ప్యాచెస్తో ఎలాంటి మెరైన్ లైఫ్ మీద ఎలాంటి నెగెటివ్ ఇంపాక్ట్ వుండదని స్పష్టం చేసింది. ఏడాదిలో రెండుసార్లు రెడ్ టైడ్ ఫినోమినన్ కన్పిస్తుందనీ, దీని వల్ల మెరైన్ ఎన్విరాన్మెంట్కి వచ్చిన నష్టమేమీ లేదని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అథారిటీ స్పష్టం చేసింది. 'అల్గే బ్లూమ్స్'గా కూడా ఈ రెడ్ టైడ్ని పిలుస్తారు. 2008లో తొలిసారిగా యూఏఈ రిజినల్ వాటర్స్లో దీన్ని గుర్తించారు. కాగా, రస్ అల్ ఖైమా కోస్ట్లో ఈ పరిస్థితిపై అప్రమత్తమయిన యూఏఈ యంత్రాంగం, ఆ ప్రాంతం నుంచి శాంపిల్స్ని సేకరించి, పరీక్షలు నిర్వహించనుంది. ఓ రకమైన బ్యాక్టీరియా కారణంగా ఇది జరుగుతుటుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ రస్ అల్ ఖైమా, డాక్టర్ సైఫ్ అల్ ఘాయిస్ చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







