బహ్రెయినీ పెవిలియన్‌ రేపే ప్రారంభం

- October 05, 2019 , by Maagulf
బహ్రెయినీ పెవిలియన్‌ రేపే ప్రారంభం

బహ్రెయిన్‌: మిడిల్‌ ఈస్ట్‌ అలాగే నార్త్‌ ఆఫ్రికా మరియు సౌత్‌ ఏషియాలో బిగ్గెస్ట్‌ టెక్‌ షో అయిన జిటెక్స్‌ 2019కి సంబంధించి బహ్రెయినీ నేషనల్‌ పెవిలియన్‌ రేపు ప్రారంభం కాబోతోంది. దుబాయ్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ వద్ద జిటెక్స్‌ 2019 నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. అరవై మంది బహ్రెయినీ ఐసీటీ ఎగ్జిబిటర్స్‌ ఈ పెవిలియన్‌లో షోకేస్‌ చేయనున్నారు. వరుసగా 11వ ఏడాది బహ్రెయిన్‌ టెక్నాలజీ కంపెనీస్‌ సొసైటీ (బిటెక్‌) ఈ పెవిలియన్‌ని ఏర్పాటు చేస్తోంది. 140 దేశాలకు చెందిన 4,800 మంది ఎగ్జిబిటర్స్‌ ఈ జిటెక్స్‌లో పాలుపంచుకుంటున్నారు. 5జీ, బ్లాక్‌ చెయిన్‌ మరియు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి విభాగాల్లో బహ్రెయిన్‌ తన సత్తాని ఈ వేదికగా చాటబోతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com