డిసెంబర్ నుంచి అబుదాబీలో స్మార్ట్ డ్రైవింగ్ పరీక్షలు
- October 07, 2019
అబుధాబి: స్మార్ట్ డ్రైవింగ్ టెస్ట్ సిస్టమ్ డిసెంబర్ నుంచి అబుధాబిలో అందుబాటులోకి రానుంది. లైసెన్స్ ప్రక్రియకు సంబంధించి ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తారు. డ్రైవర్ పరీక్షకు సంబంధించి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మరియు టెక్నాలజీస్ ద్వారా పరిస్థితిని అంచనా వేసి, ఫలితాన్ని నిర్ధారించడం జరుగుతుంది. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ని 'జీరో'గా చేసి, ఖచ్చితమైన ఫలితాన్ని ఇవ్వడమే ఈ టెక్నాలజీ ఉద్దేశ్యమని అధికారులు పేర్కొన్నారు. కారులోని పలు ప్రాంతాల్లో సెన్సార్లను అమర్చుతారు. ఆ సెన్సార్లు డ్రైవింగ్ పరీక్షని ఖచ్చితంగా నిర్ధారిస్తాయి. అబుధాబిలో 18 స్మార్ట్ కార్లు, అల్ అయిన్లో 10, అల్ దఫ్రాలో 8 స్మార్ట్ కార్లతో ఈ స్మార్ట్ టెస్ట్కి శ్రీకారం చుడతారు. చిన్న చిన్న పొరపాట్లను కూడా కంట్రోల్ రూమ్ క్యాచ్ చేసేలా ఈ విధానాన్ని అభివృద్ధి చేశారు. ప్రమాదాల్ని నివారించే క్రమంలో డ్రైవర్ సమర్థత కీలకమనీ, అత్యంత సమర్థత కలిగిన డ్రైవర్లకు మాత్రమే లైసెన్స్ ఇచ్చేందుకు ఈ స్మార్ట్ విధానం ఉపయోగపడ్తుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







