అనైతిక చర్యలు: 27 మంది ఆసియా నిర్వాసితులను అరెస్టు
- October 09, 2019
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ (ఆర్ఓపి) కమాండ్, 27 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. ఇందులో అత్యధికులు మహిళలే. పబ్లిక్ మొరాలిటీని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారంటూ వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. 'మస్కట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ 21 మంది మహిళల్ని, 6 మంది పురుషుల్నీ అరెస్ట్ చేయడం జరిగింది. వీరంతా ఆసియా జాతీయులు. పబ్లిక్ మొరాలిటీస్ని దెబ్బతీయడమే కాకుండా లేబర్ మరియు రెసిడెన్సీ ఉల్లంఘనలకు కూడా వీరు పాల్పడ్డారు..' అంటూ రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. రెంటెడ్ అపార్ట్మెంట్ల నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!







