వెదర్ అలర్ట్: రానున్న ఐదు రోజుల్లో యూఏఈకి వర్ష సూచన
- October 11, 2019
నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్సిఎం) వెల్లడించిన తాజా వివరాల ప్రకారం యూఏఈలోని పలు ప్రాంతాల్లో రానున్న ఐదు రోజుల్లో ఆకాశం మేఘావృతమయి వుంటుందనీ, అక్కడక్కడా వర్షాలు కురుస్తాయనీ తెలుస్తోంది. వాతావరణ పరిస్థితులు తీవ్ర రూపం దాల్చితే, స్కూల్ యాజమాన్యాలు క్లాసుల్ని రద్దు చేసుకునే అవకాశం కల్పిస్తూ మినిస్ట్రీ సూచనలు చేసింది. స్టూడెంట్స్, అడ్మినిస్ట్రేటివ్ మరియు టీచింగ్ స్టాఫ్ త్వరగా ఇళ్ళకు చేరే విధంగా స్కూల్ సమయాల్ని మార్చుకునేందుకూ వీలు కల్పించింది మినిస్ట్రీ. ప్రధానంగా ఫ్లడ్ ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాల్లోని స్కూళ్ళు అప్రమత్తంగా వుండాలని స్కూల్ ఆపరేషన్స్ సెక్టార్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ సూచించారు. అక్టోబర్ 11 నుంచి 15 వరకు యూఏఈలోని వాతావరణ పరిస్థితులు స్థిరంగానే వుంటాయి. సాధారణ నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఎన్సిఎం హెచ్చరిస్తోంది. సముద్ర తీర ప్రాంతాల్లో అలల తీవ్రత కూడా సాధారణ నుంచి ఓ మోస్తరుగా వుండొచ్చు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







