వెదర్ అలర్ట్: రానున్న ఐదు రోజుల్లో యూఏఈకి వర్ష సూచన
- October 11, 2019నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్సిఎం) వెల్లడించిన తాజా వివరాల ప్రకారం యూఏఈలోని పలు ప్రాంతాల్లో రానున్న ఐదు రోజుల్లో ఆకాశం మేఘావృతమయి వుంటుందనీ, అక్కడక్కడా వర్షాలు కురుస్తాయనీ తెలుస్తోంది. వాతావరణ పరిస్థితులు తీవ్ర రూపం దాల్చితే, స్కూల్ యాజమాన్యాలు క్లాసుల్ని రద్దు చేసుకునే అవకాశం కల్పిస్తూ మినిస్ట్రీ సూచనలు చేసింది. స్టూడెంట్స్, అడ్మినిస్ట్రేటివ్ మరియు టీచింగ్ స్టాఫ్ త్వరగా ఇళ్ళకు చేరే విధంగా స్కూల్ సమయాల్ని మార్చుకునేందుకూ వీలు కల్పించింది మినిస్ట్రీ. ప్రధానంగా ఫ్లడ్ ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాల్లోని స్కూళ్ళు అప్రమత్తంగా వుండాలని స్కూల్ ఆపరేషన్స్ సెక్టార్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ సూచించారు. అక్టోబర్ 11 నుంచి 15 వరకు యూఏఈలోని వాతావరణ పరిస్థితులు స్థిరంగానే వుంటాయి. సాధారణ నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఎన్సిఎం హెచ్చరిస్తోంది. సముద్ర తీర ప్రాంతాల్లో అలల తీవ్రత కూడా సాధారణ నుంచి ఓ మోస్తరుగా వుండొచ్చు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..