ఇరాన్ ఇంధన ట్యాంకర్పై మిస్సైళ్ల దాడి !
- October 11, 2019
ఇరాన్కు చెందిన ఇంధన ట్యాంకర్ పేలింది. సౌదీ అరేబియాలోని జెడ్డాకు సమీపంలో ఉన్న తీరం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇరాన్కు చెందిన నేషనల్ ఆయిల్ కంపెనీ ఓడ భారీ ఇంధనంతో వెళ్తుండగా.. మిస్సైళ్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది. జెడ్డా పోర్టుకు 60 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. భారీ రవాణా ఓడలో ఉన్న రెండు ప్రధాన చమురు స్టోరేజ్ ట్యాంక్లు తీవ్రంగా ధ్వంసమైనట్లు అంచనా వేస్తున్నారు. దీని వల్ల ఎర్ర సముద్రంలోకి చమురు లీకవుతోంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలుకాలేదని ఇరాన్ వెల్లడించింది. ఓడను మిస్సైళ్లు ఢీకొట్టినట్లు ఆయిల్ కంపెనీ చెబుతున్నా.. దానికి సంబంధించిన ఆధారాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. ప్రస్తుతం ఇంధన ట్యాంకర్ల నుంచి వెలుబడిన మంటలను ఆర్పినట్లు ఇరాన్ పేర్కొన్నది. సౌదీ, ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. గత నెలలో సౌదీ ఆరేబియాలో ఉన్న అతిపెద్ద చమురు క్షేత్రం ఆరామ్కోకు చెందిన రెండు భారీ స్టోరేజ్ కేంద్రాలపై మిస్సైళ్లు దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడులకు ఇరాన్ కారణమని అమెరికా, సౌదీ దేశాలు చెప్పాయి. కానీ తమకు ఏమాత్రం సంబంధంలేదని ఇరాన్ కూడా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







