బెంగళూరు - దుబాయ్‌ విమానం డైవర్షన్‌

- October 14, 2019 , by Maagulf
బెంగళూరు - దుబాయ్‌ విమానం డైవర్షన్‌

మస్కట్‌: బెంగళూరు నుంచి దుబాయ్‌ వెళుతున్న ఎయిర్‌ ఇండియా విమానం, మస్కట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కి డైవర్ట్‌ చేయడం జరిగింది. సాంకేతిక సమస్య తలెత్తడంతోనే ఈ డైవర్షన్‌ జరిగినట్లు ఎయిర్‌లైన్‌ ఇండస్ట్రీ అధికారి పేర్కొన్నారు. ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యతో విమానాన్ని మస్కట్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశామని అధికారులు పేర్కొన్నారు. ప్రయాణీకులు కన్‌ఫ్యూజన్‌లో వున్నారనీ, ఇబ్బందులు పడుతున్నారనీ పేర్కొంటూ సోషల్‌ మీడియాలో పోస్టింగ్స్‌ పోటెత్తాయి. పలువురు ప్రయాణీకులే సోషల్‌ మీడియా వేదికగా తమ ఆవేదనను వెల్లగక్కారు. సాయం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com