అగ్ని ప్రమాదం: 120 మంది రెసిడెంట్స్ని ఖాళీ చేయించిన అధికారులు
- October 19, 2019
యూఏఈ: అపార్ట్మెంట్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో 120 మంది రెసిడెంట్స్ ఆ భవనాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఉమ్ అల్ కువైన్ సివిల్ డిఫెన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం అల్ రావ్దాలోని అల్ రీమ్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం సంభవించగా, ఫైర్ ఫైటర్స్ సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ హానీ కలగలేదనీ, ఎవరికీ గాయాలు కూడా కాలేదని అధికారులు తెలిపారు. సివిల్ డిఫెన్స్ సిబ్బంది, 120 మంది రెసిడెంట్స్ని ఆ భవనం నుంచి ఖాళీ చేయించి, తాత్కాలిక అకామడేషన్కి తరలించారు. బిల్డింగ్ రిపెయిర్ వర్క్స్ పూర్తయ్యేవరకు తాత్కాలిక అకామడేషన్స్లోనే బాధితులు వుండాల్సి వస్తుందని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







