అగ్ని ప్రమాదం: 120 మంది రెసిడెంట్స్‌ని ఖాళీ చేయించిన అధికారులు

- October 19, 2019 , by Maagulf
అగ్ని ప్రమాదం: 120 మంది రెసిడెంట్స్‌ని ఖాళీ చేయించిన అధికారులు

యూఏఈ: అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం సంభవించడంతో 120 మంది రెసిడెంట్స్‌ ఆ భవనాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఉమ్‌ అల్‌ కువైన్‌ సివిల్‌ డిఫెన్స్‌ వెల్లడించిన వివరాల ప్రకారం అల్‌ రావ్దాలోని అల్‌ రీమ్‌ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం సంభవించగా, ఫైర్‌ ఫైటర్స్‌ సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ హానీ కలగలేదనీ, ఎవరికీ గాయాలు కూడా కాలేదని అధికారులు తెలిపారు. సివిల్‌ డిఫెన్స్‌ సిబ్బంది, 120 మంది రెసిడెంట్స్‌ని ఆ భవనం నుంచి ఖాళీ చేయించి, తాత్కాలిక అకామడేషన్‌కి తరలించారు. బిల్డింగ్‌ రిపెయిర్‌ వర్క్స్‌ పూర్తయ్యేవరకు తాత్కాలిక అకామడేషన్స్‌లోనే బాధితులు వుండాల్సి వస్తుందని అధికారులు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com