2015లో 454 మిలియన్ ఖతారీ రియాల్స్తో ఈద్ ఛారిటీ
- January 11, 2016
ఈద్ బిన్ మహమ్మద్ అల్ థని ఛారిటబుల్ అసోసియేషన్ 2015లో 59 దేశాల్లో సేవా కార్యక్రమాల్ని చేపట్టింది. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ విషయాల్ని సంస్థ ప్రతినిథులు వెల్లడించారు. 5700 ప్రాజెక్టుల్ని సంస్థ చేపట్టింది. రిలీఫ్ కార్యక్రమాల కోసం సుమారు 118 మిలియన్ ఖతారీ రియాల్స్ని వెచ్చించారు. ఇందులో సిరియా శరణార్ధుల కోసమే ఎక్కువ భాగం వెచ్చించడం జరిగింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ షేక్ ఈద్ బిన్ మహమ్మద్ అల్ థని ఓవర్సీస్ మాట్లాడుతూ, ప్రాజెక్టుల్లో గణనీయమైన వృద్ధి నమోదయ్యిందనీ, 5772 ప్రాజెక్టుల్ని 394 మిలియన్ ఖతారీ రియాల్స్తో చేపట్టామని అన్నారు. లోకల్ కల్చర్లన మరియు అడ్వొకసీ ప్రాజెక్టులు మరో 60 మిలియన్ ఖతారీ రియాల్స్తో చేపట్టారు. 59 దేశాల్లో చేపడ్తున్న హ్యుమానిటేరియన్ కార్యక్రమాల ద్వారా అసోసియేషన్ రెవెన్యూ 560 మిలియన్ ఖతారీ రియాల్స్కి చేరుకుంది. అసోసియేషన్ నేతృత్వంలో 469 మసీదులు, అవసరమైనవారికి 359 ఇళ్ళను నిర్మించి ఇచ్చారు. అలాగే 2852 వాటర్ ప్రాజెక్టుల్ని చేపట్టింది అసోసియేషన్.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







