2015లో 454 మిలియన్ ఖతారీ రియాల్స్తో ఈద్ ఛారిటీ
- January 11, 2016
ఈద్ బిన్ మహమ్మద్ అల్ థని ఛారిటబుల్ అసోసియేషన్ 2015లో 59 దేశాల్లో సేవా కార్యక్రమాల్ని చేపట్టింది. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ విషయాల్ని సంస్థ ప్రతినిథులు వెల్లడించారు. 5700 ప్రాజెక్టుల్ని సంస్థ చేపట్టింది. రిలీఫ్ కార్యక్రమాల కోసం సుమారు 118 మిలియన్ ఖతారీ రియాల్స్ని వెచ్చించారు. ఇందులో సిరియా శరణార్ధుల కోసమే ఎక్కువ భాగం వెచ్చించడం జరిగింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ షేక్ ఈద్ బిన్ మహమ్మద్ అల్ థని ఓవర్సీస్ మాట్లాడుతూ, ప్రాజెక్టుల్లో గణనీయమైన వృద్ధి నమోదయ్యిందనీ, 5772 ప్రాజెక్టుల్ని 394 మిలియన్ ఖతారీ రియాల్స్తో చేపట్టామని అన్నారు. లోకల్ కల్చర్లన మరియు అడ్వొకసీ ప్రాజెక్టులు మరో 60 మిలియన్ ఖతారీ రియాల్స్తో చేపట్టారు. 59 దేశాల్లో చేపడ్తున్న హ్యుమానిటేరియన్ కార్యక్రమాల ద్వారా అసోసియేషన్ రెవెన్యూ 560 మిలియన్ ఖతారీ రియాల్స్కి చేరుకుంది. అసోసియేషన్ నేతృత్వంలో 469 మసీదులు, అవసరమైనవారికి 359 ఇళ్ళను నిర్మించి ఇచ్చారు. అలాగే 2852 వాటర్ ప్రాజెక్టుల్ని చేపట్టింది అసోసియేషన్.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









