నేడు బ్రహ్మానందం చేతుల మీదుగా 'బిర్యానీస్ అండ్ మోర్' రెస్టారెంట్ ప్రారంభం
- October 31, 2019

దుబాయ్:ప్రముఖ సినీ హాస్యనటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ బ్రహ్మానందం, దుబాయ్లో బిర్యానీస్ అండ్ మోర్ బ్రాంచ్ని ప్రారంభిస్తున్నారు. అక్టోబర్ 31న సాయంం 6 గంటలకు ఈ రెస్టారెంట్ ప్రారంభమవుతుంది. దుబాయ్లోని అల్ నహ్దా 1 ప్రాంతంలో, ఇఎన్ఓసి పెట్రోల్ స్టేషన్ సమీపంలో హాబ్టూర్ బిల్డింగ్లో ఈ బిర్యానీస్ అండ్ మోర్ రెస్టారెంట్ని ఏర్పాటు చేశారు. ఒకేసారి 100 మంది సౌకర్యంగా కూర్చునేందుకు వీలుగా రెస్టారెంట్ని తీర్చిదిద్దామని ఫ్రాంఛైజీ ఓనర్ రషీద్ మొహమ్మదాలి చెప్పారు. తమకు ఇండియా, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా మరియు యూఏఈలో పలు చెయిన్స్ ఆఫ్ రెస్టారెంట్స్ వున్నాయని ఆయన వివరించారు. దుబాయ్లో కొత్తగా ఓపెన్ చేస్తోన్న రెస్టారెంట్లో 200కి పైగా డిషెస్ ఆహార ప్రియుల కోసం అందుబాటులో వుంటాయని తెలిపారాయన. నాన్ వెజ్తోపాటు వెజిటేరియన్ బిర్యానీలోనూ అనేక రకాలు అందుబాటులో వుంటాయి. ఒక్క నాన్ వెజ్ విభాగంలోనే 20కి పైగా వెరైటీలు తమ వద్ద లభిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. కేటరింగ్ సౌకర్యం అలాగే యాంపిల్ పార్కింగ్ స్పేస్, చిన్న చిన్న పార్టీలూ.. వంటి ప్రత్యేకతలు తమ సొంతమని నిర్వాహకులు వివరించారు. మరిన్ని వివరాలకు www.biryanis.com
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









