ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- January 12, 2026
దోహా: ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ 2026లో తొమ్మిది మరియు పదవ తరగతి విద్యార్థులకు టెటానస్, డిఫ్తీరియా మరియు పెర్టుసిస్ (Tdap) వ్యాక్సిన్ వేయనుంది. విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ, హమద్ మెడికల్ కార్పొరేషన్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్తో కలిసి వార్షిక క్యాంపెయిన్ ను ప్రారంభించింది.
278 ప్రభుత్వ, ప్రైవేట్ మరియు కమ్యూనిటీ పాఠశాలల్లోని 51,772 మంది విద్యార్థులకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే పేరెంట్స్ కు నోటిఫికేషన్లను పంపే ప్రక్రియను ప్రారంభించినట్లు ఆరోగ్య పరిరక్షణ మరియు అంటువ్యాధుల నియంత్రణ విభాగం డైరెక్టర్ డాక్టర్ హమద్ ఈద్ అల్-రొమైహి తెలిపారు. వ్యాక్సినేషన్ పై అపోహలను తొలగించేందుకు స్కూల్స్ వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ గత శనివారం దాదాపు 240 మంది వైద్య మరియు నర్సింగ్ నిపుణులతో అవగాహన వర్క్షాప్ను నిర్వహించింది. ఈ వార్షిక వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.
తాజా వార్తలు
- యూఏఈలో 100కు పైగా ఎస్ఎం అకౌంట్స్ బ్లాక్..!!
- కువైట్ బేలోకి ప్రవేశం నిషేధం..!!
- ప్రజలకు అత్యవసర అలెర్ట్ జారీ చేసిన బహ్రెయిన్..!!
- ఒమన్లో దంచికొడుతున్న ఎండలు..డాక్టర్ల హెచ్చరికలు..!!
- సౌదీ, GCC పౌరులు మే 3 వరకే అవకాశం..!!
- కార్యాలయ భద్రత, అత్యవసర సంసిద్ధత పై పీహెచ్సీసీ ప్రకటన..!!
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు









