ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- January 12, 2026
దోహా: ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ 2026లో తొమ్మిది మరియు పదవ తరగతి విద్యార్థులకు టెటానస్, డిఫ్తీరియా మరియు పెర్టుసిస్ (Tdap) వ్యాక్సిన్ వేయనుంది. విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ, హమద్ మెడికల్ కార్పొరేషన్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్తో కలిసి వార్షిక క్యాంపెయిన్ ను ప్రారంభించింది.
278 ప్రభుత్వ, ప్రైవేట్ మరియు కమ్యూనిటీ పాఠశాలల్లోని 51,772 మంది విద్యార్థులకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే పేరెంట్స్ కు నోటిఫికేషన్లను పంపే ప్రక్రియను ప్రారంభించినట్లు ఆరోగ్య పరిరక్షణ మరియు అంటువ్యాధుల నియంత్రణ విభాగం డైరెక్టర్ డాక్టర్ హమద్ ఈద్ అల్-రొమైహి తెలిపారు. వ్యాక్సినేషన్ పై అపోహలను తొలగించేందుకు స్కూల్స్ వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ గత శనివారం దాదాపు 240 మంది వైద్య మరియు నర్సింగ్ నిపుణులతో అవగాహన వర్క్షాప్ను నిర్వహించింది. ఈ వార్షిక వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







