ఎయిర్‌ ఇండియా విమానం ఆలస్యం: దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణీకుల పాట్లు

- November 01, 2019 , by Maagulf
ఎయిర్‌ ఇండియా విమానం ఆలస్యం: దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణీకుల పాట్లు

దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో 200 మందికిపైగా ప్రయాణీకులు ఎయిర్‌ ఇండియా విమానం ఆలస్యం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు విమానం టేకాఫ్‌ అవ్వాల్సి వుండగా, ఎయిర్‌ ఇండియా సంస్థ నుంచి ఎలాంటి స్పందనా లేకుండా ప్రయాణీకుల్ని పడిగాపులు పడేలా చేశారు. తీవ్ర ఆగ్రహావేశాలకు గురైన ప్రయాణీకులు, సోషల్‌ మీడియా వేదికగా సంస్థకు అలాగే భారత ప్రభుత్వాన్ని, సంబంధిత మంత్రిత్వ శాఖల్ని ట్యాగ్‌ చేస్తూ ట్వీట్లు చేశారు. ఎట్టకేలకు రాత్రి సమయంలో ప్రయాణీకుల్ని ఉద్దేశించి అధికారిక ప్రకటన వచ్చింది. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు విమానాన్ని రీ-షెడ్యూల్‌ చేశారన్నది ఆ ప్రకటన సారాంశం.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com