టిఆర్టీసీపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
- November 02, 2019
హైదరాబాద్:ఆర్టీసీ సమ్మెపై మరోసారి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ప్రసక్తే లేదని మరోసారి కుండబద్ధలు కొట్టారు. ఆర్టీసీ యూనియన్లు అనాలోచితంగా సమ్మె చేస్తున్నాయని, దురహంకారపూరితంగా కార్మికులు సమ్మెలోకి వెళ్లారని వెల్లడించారు. 2019, నవంబర్ 02వ తేదీ శనివారం సాయంత్రం ప్రగతి భవన్లో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. మొత్తం 49 అంశాలపై చర్చించారు. కేబినెట్ సమావేశాలకు సంబంధించిన వివరాలను సీఎం కేసీఆర్ మీడియాకు వివరించారు.
తాను రవాణా శాఖగా తాను పనిచేసినట్లు తెలిపారు. కొన్ని మార్పులు చేయాల్సినవసరం ఉందన్నారు. 5 వేల 100 ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించడం జరిగిందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం అనేది బాధ్యతాయుతమైన వ్యవహరమని, ప్రభుత్వంలో విలీనం చేయకూడదని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. 10 వేల 400 బస్సులను ఆర్టీసీ నడుపుతోందన్నారు. సమ్మెలోకి వెళ్లవద్దని చెప్పినట్లు..నిపుణుల కమిటీ వేయడం జరిగిందని చెప్పినా..కార్మికులు సమ్మెలోకి వెళ్లారని తెలిపారు.
సమ్మె విరుద్ధమని కోర్టుకు సమర్పించినట్లు, ఇల్లీగల్ స్ట్రైక్ అని డిక్లైర్డ్ చేస్తే..యాజమాన్యం..కార్మికులకు సంబంధాలు తెగిపోతాయన్నారు. కార్మికుల నోట్లో మట్టి కొట్టారని...మొత్తంగా 49 వేల మంది కార్మికుల రోడ్లపై పడాల్సి వచ్చిందన్నారు. ప్రతిపక్షాల మాటలను నమ్మి..భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తున్నారని, ఇది ఏ మాత్రం లాభం కాదన్నారు సీఎం కేసీఆర్.
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..







