మరోసారి యూఏఈ ప్రెసిడెంట్గా షేక్ ఖలీఫా ఎన్నిక
- November 07, 2019
షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరోమారు యూఏఈ ప్రెసిడెంట్గా సుప్రీం కౌన్సిల్ ద్వారా ఎన్నికయ్యారు. తొలిసారిగా 2004 అక్టోబర్ 3న షేక్ ఖలీఫా ప్రెసిడెంట్ పదవికి ఎంపికయ్యారు. ఆయన ప్రెసిడెంట్గా ఎంపికవడం ఇది వరుసగా నాలుగోసారి. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా నేతృత్వంలో యూఏఈ మరింతగా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా సుప్రీం కౌన్సిల్ ఆశాభావం వ్యక్తం చేసింది.యూఏఈ ఫౌండర్ షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్తో కలిసి యూఏఈ అభివృద్ధికి ఎంతో శ్రమించారు. దేశానికి సమర్థ నాయకత్వం అందించేందుకు తనవంతు కృషి చేశారు. యూఏఈ ఫౌండింగ్ ఫాదర్ మృతి తర్వాత తానే నాయకత్వాన్ని అందుకుని, యూఏఈని మరింత ముందుకు నడిపారు. ప్రపంచ వ్యాప్తంగా యూఏఈకి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారు షేక్ ఖలీఫా.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







