మరోసారి యూఏఈ ప్రెసిడెంట్గా షేక్ ఖలీఫా ఎన్నిక
- November 07, 2019
షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరోమారు యూఏఈ ప్రెసిడెంట్గా సుప్రీం కౌన్సిల్ ద్వారా ఎన్నికయ్యారు. తొలిసారిగా 2004 అక్టోబర్ 3న షేక్ ఖలీఫా ప్రెసిడెంట్ పదవికి ఎంపికయ్యారు. ఆయన ప్రెసిడెంట్గా ఎంపికవడం ఇది వరుసగా నాలుగోసారి. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా నేతృత్వంలో యూఏఈ మరింతగా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా సుప్రీం కౌన్సిల్ ఆశాభావం వ్యక్తం చేసింది.యూఏఈ ఫౌండర్ షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్తో కలిసి యూఏఈ అభివృద్ధికి ఎంతో శ్రమించారు. దేశానికి సమర్థ నాయకత్వం అందించేందుకు తనవంతు కృషి చేశారు. యూఏఈ ఫౌండింగ్ ఫాదర్ మృతి తర్వాత తానే నాయకత్వాన్ని అందుకుని, యూఏఈని మరింత ముందుకు నడిపారు. ప్రపంచ వ్యాప్తంగా యూఏఈకి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారు షేక్ ఖలీఫా.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









