మరోసారి యూఏఈ ప్రెసిడెంట్గా షేక్ ఖలీఫా ఎన్నిక
- November 07, 2019
షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరోమారు యూఏఈ ప్రెసిడెంట్గా సుప్రీం కౌన్సిల్ ద్వారా ఎన్నికయ్యారు. తొలిసారిగా 2004 అక్టోబర్ 3న షేక్ ఖలీఫా ప్రెసిడెంట్ పదవికి ఎంపికయ్యారు. ఆయన ప్రెసిడెంట్గా ఎంపికవడం ఇది వరుసగా నాలుగోసారి. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా నేతృత్వంలో యూఏఈ మరింతగా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా సుప్రీం కౌన్సిల్ ఆశాభావం వ్యక్తం చేసింది.యూఏఈ ఫౌండర్ షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్తో కలిసి యూఏఈ అభివృద్ధికి ఎంతో శ్రమించారు. దేశానికి సమర్థ నాయకత్వం అందించేందుకు తనవంతు కృషి చేశారు. యూఏఈ ఫౌండింగ్ ఫాదర్ మృతి తర్వాత తానే నాయకత్వాన్ని అందుకుని, యూఏఈని మరింత ముందుకు నడిపారు. ప్రపంచ వ్యాప్తంగా యూఏఈకి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారు షేక్ ఖలీఫా.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







