యువనటుడి తప్పతాగి రెస్టారెంట్లో వీరంగం..
- January 12, 2016
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని బార్లో తప్పతాగి చిందులు వేయడమే కాకుండా సిబ్బంది పైన దాడికి పాల్పడిన ఓ నటుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతను ఫ్రెండ్స్ బుక్ సినిమా నటుడిగా తెలుస్తోంది. అతని పేరు నండూరి ఉదయ్ కిరణ్.అతను టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలోని జిఆర్టీ గ్రాండ్ బార్ అండ్ రెస్టారెంట్లో సోమవారం రాత్రి తప్పతాగి గందరగోళం సృష్టించినట్లు సీఐ తెలిపారు. అడ్డుకునేందుకు యత్నించిన బార్ సిబ్బందిని కొట్టడమే కాకుండా చంపుతానని బెదిరించాడన్నారు.రెస్టారెంటు అద్దాలు పగులగొట్టి కుర్చీలు విసిరేసాడని బార్ నిర్వాహకులు ఫిర్యాదు చేశారని, వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.సినీ హీరోగా చెబుతూ అవకాశాలు ఇప్పిస్తానని చెబుతూ అనేక మందిని ఉదయ్ కిరణ్ మోసం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి రూ.లక్షల్లో డబ్బు కాజేసినట్లు పలు స్టేషన్లలో ఫిర్యాదులున్నట్లు చెప్పారు. ఇదే తరహాలో హైదరాబాద్లోని పలు స్టేషన్లలో సుమారు ఇరవై కేసుల్లో నిందితుడని సీఐ వెల్లడించారు. ఉదయ్ కిరణ్ నటనపై ఆసక్తితో కాకినాడ నుంచి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చాడు.ఫిలింనగర్లోని నటుల దృష్టిలో పడ్డాడు. టీవీ సీరియళ్లు, సినిమాల్లో అవకాశాలు పొందాడు. పరారే, రాక్షసులు, యువరాజ్యం, ఫ్రెండ్స్బుక్ వంటి చిత్రాల్లో నటించాడు. నటుడిగా పేరు తెచ్చుకున్న సమయంలో.. డ్రగ్స్కు బానిసయ్యాడు. నైజీరియన్లతో కలిసి వ్యాపారం నిర్వహించేంత వరకూ మారిపోయాడని వార్తలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







