భారతీయులను వెనక్కి పంపిన అమెరికా!

- November 20, 2019 , by Maagulf
భారతీయులను వెనక్కి పంపిన అమెరికా!

న్యూఢిల్లీ: తమ దేశంలోకి అక్రమంగా వలస వచ్చారనే కారణంతో 145 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపించింది. వీరితో పాటు పలువురు శ్రీలంక, బంగ్లాదేశ్ వాసులను కూడా వెనక్కి పంపించేసింది. భారతీయులంతా ఈరోజు ఢిల్లీలోని ఇందిగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అమెరికా అధికారులు కథనం ప్రకారం. వీరంగా గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ ఏజెంట్లను ఆశ్రయించి అమెరికాకు చేరుకున్నారు. మరికొందరు వీసా గడువు ముగిసినప్పటికీ చట్ట విరుద్ధంగా అక్కడే ఉంటున్నారు. అక్రమ వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో, అక్కడి అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com