ఢిల్లీ వెళ్లే విమాన ప్రయాణికులకు ఎయిర్ ఏసియా ఆఫర్
- November 20, 2019
న్యూఢిల్లీ : ఢిల్లీ వెళ్లే విమాన ప్రయాణికులకు ఎయిర్ ఏసియా శుభవార్త వెల్లడించింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కాలుష్యం కమ్ముకున్న నేపథ్యంలో ఎయిర్ ఏసియా ఢిల్లీకి ప్రయాణిస్తున్న తన విమాన ప్రయాణికులకు యాంటీ పొల్యూషన్ మాస్క్లను పంపిణీ చేస్తోంది. హైదరాబాద్ నగరంతోపాటు ముంబై, బెంగళూరు, కోల్కతా నగరాల నుంచి ఢిల్లీకి వస్తున్న ప్రయాణికులు కాలుష్యం బారిన పడకుండా ఎయిర్ ఏసియా యాంటీ పొల్యూషన్ మాస్క్ లను పంపిణీ చేస్తోంది. హెల్త్ టెక్నాలజీ స్టార్ట్ అప్ ఎంఫిన్ సంస్థ భాగస్వామ్యంతో విమాన ప్రయాణికులకు యాంటీ పొల్యూషన్ మాస్క్ లను అందిస్తోంది. ఢిల్లీలో వెలువడుతున్న కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినకుండా ముందుజాగ్రత్తగా యాంటీ పొల్యూషన్ మాస్క్లను ఈ నెల 19 నుంచి 29వతేదీ వరకు అందించాలని నిర్ణయించామని ఎయిర్ ఏసియా అధికార ప్రతినిధి వెల్లడించారు. విమాన ప్రయాణికులు కలుషిత వాయువులు పీల్చి అనారోగ్యం బారిన పడకుండా ఈ మాస్క్ లు ఎంతగానో ఉపయోగపడతాయని ఎయిర్ ఏసియా తెలిపింది.
తాజా వార్తలు
- చార్లెట్లో ‘NATS’ ఉచిత వైద్య శిబిరం
- ఎబోలా వైరస్ కలకలం: కాంగోలో 118 మంది మృతి..
- రాలీ పోలీసులతో ప్రవాస తెలుగు పిల్లల ముఖాముఖి
- రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ.. ప్రధాని మెలోనీతో భేటీ
- కాన్సాస్ నగరంలో డా.మాగంటి మురళీ మోహన్కు సువర్ణ సత్కారం
- రోమ్లో భారతీయ సమాజం ప్రధాని మోదీకు ఘన స్వాగతం..
- ఎబోలా వైరస్ ను ఎదుర్కోవడానికి సిద్ధం: యూఏఈ
- ప్రైవేట్ కంటెంట్ షేరింగ్ పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక..!!
- అడ్డదిడ్డ పార్కింగ్..కమిటీని ఏర్పాటు చేసిన కువైట్..!!
- జాతీయ, ప్రజల భద్రతకు పటిష్ఠ చర్యలు..!!









