ఢిల్లీ వెళ్లే విమాన ప్రయాణికులకు ఎయిర్ ఏసియా ఆఫర్
- November 20, 2019న్యూఢిల్లీ : ఢిల్లీ వెళ్లే విమాన ప్రయాణికులకు ఎయిర్ ఏసియా శుభవార్త వెల్లడించింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కాలుష్యం కమ్ముకున్న నేపథ్యంలో ఎయిర్ ఏసియా ఢిల్లీకి ప్రయాణిస్తున్న తన విమాన ప్రయాణికులకు యాంటీ పొల్యూషన్ మాస్క్లను పంపిణీ చేస్తోంది. హైదరాబాద్ నగరంతోపాటు ముంబై, బెంగళూరు, కోల్కతా నగరాల నుంచి ఢిల్లీకి వస్తున్న ప్రయాణికులు కాలుష్యం బారిన పడకుండా ఎయిర్ ఏసియా యాంటీ పొల్యూషన్ మాస్క్ లను పంపిణీ చేస్తోంది. హెల్త్ టెక్నాలజీ స్టార్ట్ అప్ ఎంఫిన్ సంస్థ భాగస్వామ్యంతో విమాన ప్రయాణికులకు యాంటీ పొల్యూషన్ మాస్క్ లను అందిస్తోంది. ఢిల్లీలో వెలువడుతున్న కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినకుండా ముందుజాగ్రత్తగా యాంటీ పొల్యూషన్ మాస్క్లను ఈ నెల 19 నుంచి 29వతేదీ వరకు అందించాలని నిర్ణయించామని ఎయిర్ ఏసియా అధికార ప్రతినిధి వెల్లడించారు. విమాన ప్రయాణికులు కలుషిత వాయువులు పీల్చి అనారోగ్యం బారిన పడకుండా ఈ మాస్క్ లు ఎంతగానో ఉపయోగపడతాయని ఎయిర్ ఏసియా తెలిపింది.
తాజా వార్తలు
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్