దుబాయ్: ప్రముఖ సోషల్ వర్కర్ 'ఉమా పద్మనాభన్' కు ఆత్మీయ సన్మానం
- November 20, 2019
దుబాయ్: యూఏఈ.. అదో అందమైన దేశం.. ఎంత అందమైనదో అంత కఠినం కూడా! ఎన్నో ఆంక్షలు విధించే ప్రభుత్వం. మరి ఇలాంటి పరిస్థితుల్లో పొట్ట చేతపట్టుకొని నకిలీ ఏజెంట్ల బారిన పడి ఇక్కడికి వచ్చాక ఎన్నో సమస్యనలు ఎదుర్కొని ఒక్కోసారి కటకటాల బారిన పడిన తమ్ముళ్ల సంఖ్య కోకొల్లలు. అలాంటి వారికి నేనున్నాను అని సాయం అందించే ప్రముఖ సోషల్ వర్కర్ శ్రీమతి ఉమా పద్మనాభన్ (ఉమా ప్యాడీ)..40 ఏళ్ల సుదీర్ఘ సేవలు అందించి ఎందరినో ఆదుకున్న ఉమా, దుబాయ్ విడిచి భారతదేశం తిరిగి వెళ్ళిపోతున్న సందర్భంగా దుబాయ్ లోని 'వేవ్ సంస్థ' మరియు స్నేహితులు, అభిమానులు కలిసి ఉమా పద్మనాభన్ ను సత్కరించి ఆమెకు ఘన వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా 'వేవ్ సంస్థ' ఫౌండర్ గీతా రమేష్ మాట్లాడుతూ ఆర్తులకు ఉమా అందించిన సేవలు గొప్పవి అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పలువురు ప్రముఖులు ఉమా తో తమకున్న అనుబంధాన్ని 'మాగల్ఫ్.కామ్' తో పంచుకున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!