దుబాయ్: ప్రముఖ సోషల్ వర్కర్ 'ఉమా పద్మనాభన్' కు ఆత్మీయ సన్మానం
- November 20, 2019
దుబాయ్: యూఏఈ.. అదో అందమైన దేశం.. ఎంత అందమైనదో అంత కఠినం కూడా! ఎన్నో ఆంక్షలు విధించే ప్రభుత్వం. మరి ఇలాంటి పరిస్థితుల్లో పొట్ట చేతపట్టుకొని నకిలీ ఏజెంట్ల బారిన పడి ఇక్కడికి వచ్చాక ఎన్నో సమస్యనలు ఎదుర్కొని ఒక్కోసారి కటకటాల బారిన పడిన తమ్ముళ్ల సంఖ్య కోకొల్లలు. అలాంటి వారికి నేనున్నాను అని సాయం అందించే ప్రముఖ సోషల్ వర్కర్ శ్రీమతి ఉమా పద్మనాభన్ (ఉమా ప్యాడీ)..40 ఏళ్ల సుదీర్ఘ సేవలు అందించి ఎందరినో ఆదుకున్న ఉమా, దుబాయ్ విడిచి భారతదేశం తిరిగి వెళ్ళిపోతున్న సందర్భంగా దుబాయ్ లోని 'వేవ్ సంస్థ' మరియు స్నేహితులు, అభిమానులు కలిసి ఉమా పద్మనాభన్ ను సత్కరించి ఆమెకు ఘన వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా 'వేవ్ సంస్థ' ఫౌండర్ గీతా రమేష్ మాట్లాడుతూ ఆర్తులకు ఉమా అందించిన సేవలు గొప్పవి అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పలువురు ప్రముఖులు ఉమా తో తమకున్న అనుబంధాన్ని 'మాగల్ఫ్.కామ్' తో పంచుకున్నారు.
తాజా వార్తలు
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ