తెలంగాణకు ఇండియా టుడే అవార్డు
- November 23, 2019
హైదరాబాద్: "ఇండియాటుడే" దేశవ్యాప్తంగా నిర్వహించిన "స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ సర్వేలో మోస్ట్ ఇంప్రూవ్డ్ స్టేట్ ఇన్ గవర్నెన్స్- 2019" అవార్డుకు తెలంగాణ రాష్ట్రం ఎంపికైంది. ఈ అవార్డును శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఎంపి కె.కెశవరావు అందుకున్నారు. ఈ సందర్భంగా కెకె మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్ కృషితో తెలంగాణ ప్రభుత్వం ర్రపజలకు ఆర్థిక, సామాజిక, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తుందని చెప్పారు. నూతనంగా ఆవిర్భవించిన రాష్ట్రం అయినప్పటికీ పరిపాలన అంశంలో ప్రభుత్వం ప్రజలకు చేరువగా ఉందని ఆయన అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మంత్రం ఏమిటని ఇండియా టుడే సంస్థ ప్రతినిధులు అడగగా సిఎం కెసిఆర్ ప్రజలవద్దకు పాలనను తీసుకెళ్లి వారి సంక్షేమం, అభివృద్ధికోసం నిరంతరం కృషి చేస్తున్నారని ఎంపి కెకె చెప్పారు. కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కష్టపడే తత్వం, నాయకత్వం, దృష్టి, స్పష్టత అని కెకె చెప్పారు. ఇండియా టుడే స్టేట్ ఆఫ్ స్టేట్స్ కాన్ క్లేవ్ 2019 అవార్డును తెలంగాణ ప్రభుత్వానికి ప్రదానం చేసినందుకు రాష్ట్ర మంత్రి,టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈ అవార్డును తీసుకున్న కెకెను కెటిఆర్ అభినందించారు.
తాజా వార్తలు
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!







