తెలంగాణకు ఇండియా టుడే అవార్డు
- November 23, 2019
హైదరాబాద్: "ఇండియాటుడే" దేశవ్యాప్తంగా నిర్వహించిన "స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ సర్వేలో మోస్ట్ ఇంప్రూవ్డ్ స్టేట్ ఇన్ గవర్నెన్స్- 2019" అవార్డుకు తెలంగాణ రాష్ట్రం ఎంపికైంది. ఈ అవార్డును శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఎంపి కె.కెశవరావు అందుకున్నారు. ఈ సందర్భంగా కెకె మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్ కృషితో తెలంగాణ ప్రభుత్వం ర్రపజలకు ఆర్థిక, సామాజిక, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తుందని చెప్పారు. నూతనంగా ఆవిర్భవించిన రాష్ట్రం అయినప్పటికీ పరిపాలన అంశంలో ప్రభుత్వం ప్రజలకు చేరువగా ఉందని ఆయన అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మంత్రం ఏమిటని ఇండియా టుడే సంస్థ ప్రతినిధులు అడగగా సిఎం కెసిఆర్ ప్రజలవద్దకు పాలనను తీసుకెళ్లి వారి సంక్షేమం, అభివృద్ధికోసం నిరంతరం కృషి చేస్తున్నారని ఎంపి కెకె చెప్పారు. కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కష్టపడే తత్వం, నాయకత్వం, దృష్టి, స్పష్టత అని కెకె చెప్పారు. ఇండియా టుడే స్టేట్ ఆఫ్ స్టేట్స్ కాన్ క్లేవ్ 2019 అవార్డును తెలంగాణ ప్రభుత్వానికి ప్రదానం చేసినందుకు రాష్ట్ర మంత్రి,టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈ అవార్డును తీసుకున్న కెకెను కెటిఆర్ అభినందించారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







